You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Indie Author Championship #6
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palఆర్టికల్ 53,73,74,75 ప్రకారం ఈ దేశాన్ని రాష్ట్రపతి పాలించాలి. రాష్ట్రాలను ఆ. 154, 163, 164 ప్రకారం గవర్నర్లు పాలించాలి. ప్రధానమంత్రుల పాలన, ముఖ్యమంత్రుల పాలన రాజ్యాంగ విరుద్ధం. దేశంలో పదవి పేరుతో ఆర్టికల్ 54 ప్రకారం ఎన్నికయే అధికారి రాష్ట్రపతి ఒక్కడే. ఆయన ప్రతినిధులే గవర్నర్లు. కేంద్ర మంత్రులు రాష్ట్రపతిచే, రాష్ట్ర మంత్రులు గవర్నరుచే నియమించబడి తొలగించబడే సహాయకులు, సలహాదారులు మాత్రమే. ఆ. 1 ప్రకారం భారతదేశం రాష్ట్రాల యూనియన్. అందువల్ల యూనిటరీ. ఫెడరల్ కాదు. రాజ్యాంగ పీఠిక ప్రకారం భారత దేశం ‘రిపబ్లిక్” అనగా ఎన్నుకొనబడ్డ రాష్ట్రపతి పాలించే దేశమని అర్థం. బహుళపార్టీ వ్యవస్థ, ప్రాంతీయపార్టీ వ్యవస్థ, పార్టీల కూటములు చట్టవిరుద్ధాలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ చొప్పున దేశంలో 30 ప్రభుత్వాలుంటే సార్వభౌమాధికారం సాధ్యం కాదు. దేశ సార్వభౌమాధికారం ఆ. 73 ప్రకారం రాష్ట్రపతిదైయున్నందున రాష్ట్ర మంత్రివర్గాలకు రాష్ట్రాలలో భూ బదలాయింపులు చేసే అధికారం లేదు. ఆ.83 ప్రకారం పార్లమెంటు పదవీకాలం, ఆ. 172 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం, ఆ. 56 ప్రకారం రాష్ట్రపతి పదవీకాలం, 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవికి మధ్యంతర ఎన్నిక జరగవచ్చు కానీ చట్ట సభలకు మధ్యంతర ఎన్నికలు రాజ్యాంగవిరుద్ధం. చట్టసభలను రద్దుచేయడమంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసినట్లే. ప్రతిపక్ష సభ్యుల సభ్యత్వాలను ప్రధానమంత్రి గానీ , ముఖ్యమంత్రి గానీ సామూహికంగా రద్దు చేయమని సిఫారసు చేయడం చెల్లదు. రాజకీయ పార్టీలు గెలిచిన తరువాత ఏఏ రంగాలకు ప్రాధాన్యమిస్తారో ప్రకటించవచ్చు కానీ ఏ వర్గానికి ఏమి లబ్ది చేకూరుస్తాయో చెప్పే ఎన్నికల మేనిఫెస్టోలు కాంట్రాక్టు చట్టం సె.2డి ‘ప్రతిఫలం’ నిర్వచనంలోకి వస్తాయి కాబట్టి అవి ఎన్నికల నేరాలే. రెండు పార్టీల విధానంలోకి మారి, ఇండియన్ యూనియన్ పాలనా పగ్గాలు రాష్ట్రపతికి అప్పగించకుంటే అనతికాలంలోనే భారత దేశం ముక్కలవడం ఖాయం.
హరిబాబు ఈశ్వరప్రగడ
రచయిత ఈశ్వరప్రగడ హరిబాబు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఈయన సి.ఎ.తో పాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత, రాజకీయ అవినీతికి కలత చెంది, దేశానికేదైనా మేలు చేయాలని అలోచించి, ఈనాటి అనుచిత విధానాలు నిజంగా రాజ్యాంగం అనుమతిస్తుందా అన్న అనుమానంతో రాజ్యాంగాన్ని పఠించారు. ఈనాటి అవకతవకలకు రాజ్యాంగ దురవగాహన, వక్రీకరణలే కారణమని గ్రహించి అట్టి విషయాలను దేశ ప్రజలముందుంచే ప్రయత్నంగానే ఈ గ్రంథరచన గావించారు.
The items in your Cart will be deleted, click ok to proceed.